లిక్కర్ మాఫియా కోరలు చాచిందంటూ ఓ వీడియో పోస్ట్ చేసిన లోకేశ్

  • ఒక పక్క కరోనాతో  వేలాది మంది  ఇబ్బందులు
  • పదుల సంఖ్యలో ప్రతి రోజు ప్రాణాలు కోల్పోతున్నారు
  • అయినా జగన్ రెడ్డి గారి ధన దాహం తీరడం లేదు
కరోనా వ్యాప్తి ప్రతిరోజు అంతకంతకూ పెరిగిపోతోంటే ఏపీలో కనీసం భౌతిక దూరం కూడా పాటించకుండా మద్యం షాపుల వద్ద జనం బారులు తీరి నిలబడుతున్నారని తెలుపుతూ టీడీపీ నేత నారా లోకేశ్ విమర్శలు గుప్పించారు. డబ్బుకి ఆశపడి జగన్‌ మద్యం అమ్మకాలను ప్రోత్సహిస్తున్నారని ఆయన విమర్శించారు.

'వైఎస్ జగన్ లిక్కర్ మాఫియా కోరలు చాచింది. ఒక పక్క కరోనా బారిన పడి వేలాది మంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. పదుల సంఖ్యలో ప్రతి రోజు ప్రాణాలు కోల్పోతున్నారు. అయినా జగన్ రెడ్డి గారి ధన దాహం తీరడం లేదు' అని లోకేశ్ విమర్శలు గుప్పించారు.

'రాష్ట్రంలో కరోనా కల్లోలం సృష్టిస్తున్న సమయంలో 25 వేల కోట్ల రూపాయల జే ట్యాక్స్ కోసం ప్రజల ప్రాణాలు తాకట్టు పెడుతున్నారు. కరోనా వ్యాప్తికి నిలయాలుగా మారుతున్న జగన్ మద్యం దుకాణాలు తక్షణం మూసివేయాలి' అని ఆయన డిమాండ్ చేశారు.


Nara Lokesh
Telugudesam
Andhra Pradesh

More Telugu News